ఏపీకి రానున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. ఏపీలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని సమాచారం. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వేజోన్ పరిపాలన భవనాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతారు.