Home Page SliderNational

ప్రభాస్ బాక్సాఫీస్ ట్రాక్.. నెక్ట్స్ తారక్!

 ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల జాబితాలో ఈ నలుగురు టాప్‌లో ఉన్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలుగా తమకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గ్లోబల్ లెవల్‌లో వారి సినిమాలకి 300 నుంచి 400 కోట్ల బిజినెస్ జరుగుతోంది. అలాగే హిట్ టాక్ వస్తే ఈజీగా 500 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించే సత్తా ఉన్న హీరోలుగా పేర్కొనబడ్డారు. సూపర్ సక్సెస్ అందుకుంటే 1000 కోట్ల వరకు తమ సినిమాలతో అందుకోగలరు. ప్రభాస్ ‘బాహుబలి 2’ తర్వాత ఇప్పటివరకు ఐదు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరో ఐదు ప్రాజెక్ట్స్ లైన్ అప్‌లో ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ ‘దేవర’తో సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవల్‌లో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా‌తో థియేటర్లలోకి రానున్నారు. ‘పుష్ప’తో పాన్ ఇండియా హిట్ అందుకొన్న ‘పుష్ప 2’తో సక్సెస్ రికార్డ్‌ని కొనసాగించడానికి అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ థియేటర్స్‌లోకి రాబోతోంది. భారీ అంచనాలు ఈ చిత్రంపై ఉన్నాయి. ఈ సినిమా ముందు చాలా టార్గెట్స్ ఉన్నాయి. వాటిని తారక్ తన ఇమేజ్‌తో అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందులో 150 + కోట్ల షేర్ ఒకటి. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ మాత్రమే 6 సార్లు 150 + కోట్ల షేర్‌ని అందుకున్నారు. ‘దేవర’ సినిమాతో తారక్ ప్రూవ్ చేసుకుంటే పాన్ ఇండియా స్టార్‌గా అతని హవా ఇప్పట్లో ఆగదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా రేస్‌లో రెండో స్థానంలోకి వెళ్తాడా అనేది వెయిట్ అండ్ సీ.