ఓట్ల లెక్కింపు రోజున పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న: డీజీపీ
హైదరాబాద్: ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. సీపీలు, ఎస్పీలతో డీజీపీ ఇవాళ టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్ష జరిపారు. లెక్కింపు కేంద్రాల వెలుపల పటిష్ఠ నిఘా పెట్టాలని, కేంద్రాల లోపల సైతం దృష్టి సారించాలని అంజనీకుమార్ సూచించారు. చివరి రౌండ్లలో ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎవరినీ గుమికూడకుండా చూడాలని, పికెటింగ్ చేయడంతో పాటు అదనపు బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. గెలుపొందిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రతీకారదాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.


 
							 
							