త్వరలో భేటీ కాబోతున్న మోదీ, రిషి సునక్
ఇండోనేషియాలోని బాలిలో వచ్చే నెల జీ20 లీడర్ షిప్ సమ్మిట్లో బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్, ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో ఇరువురూ ప్రత్యేకంగా కలిసేందుకు అంగీకారం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్లు ప్రపంచ ఆర్థికశక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి సమ్మతం తెలిపారని ప్రకటనలో పేర్కొంది. మరోవైపు పీఎం బాధ్యతలను చేపట్టిన రిషి సునక్ను నిన్న ప్రధాని మోదీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు.