Breaking Newshome page sliderHome Page SliderPoliticsTelangana

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా పడింది . ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఫొరెన్సిక్ నివేదికలో కీలకమైన ఆధారాలు లభించాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై బుధవారం జస్టిసి బీవీ నాగరత్న,జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఎఫ్ఎస్ఎల్ (FSL report) నివేదిక అందిందని అందులో డిజిటల్ ఫోరెన్సిక్ ప్లాట్ ఫామ్ నుంచి కీలక ఆధారాలు లభించాయని కోర్టుకు తెలిపారు. ఈ వాదనల తరువాత తదుపరి విచారణను ధర్మాసనం అక్టోబర్ 14కు వాయిదా వేసింది. కాగా గత విచారణలో సందర్భంలో ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించడం లేదని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో దర్యాప్తుకు సహకరించాలని ప్రభాకర్ రావును కోర్టు ఆదేశించింది.