home page sliderHome Page SliderTelangana

పామును చూసి జాలిపడ్డ జనం..

పామును చూసిన వెంటనే మీటర్ల దూరం పారిపోయే వారిని చూశాం.. కానీ ఇక్కడ మాత్రం విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే.. ఓ పామును చూసిన జనం అయ్యో పాపం అని జాలిపడ్డారు. ఓ పాము అక్కడ ఉన్న వలలో చిక్కుకుంది. అది గమనించిన జనం ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్’ సొసైటీకు సమాచారమిచ్చారు. పాముని బయటకు తీశారు. ఇది ర్యాట్ స్నేక్ అని విషపూరితమైనది కాదని తెలిపారు. ఈ ఘటన రంగారెడ్డి మంచిరేవులలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం గోశాల వద్ద జరిగింది.