అక్కడ 12 ఎకరాలు స్థలం కొన్న పవన్ కళ్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజక వర్గం పిఠాపురంలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనిని పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ స్థలాన్ని తన ఇల్లు, క్యాంపు కార్యాలయం కోసం కొన్నట్లు పవన్ పేర్కొన్నారు. గతంలో కూడా పిఠాపురం మండలంలోని భోగాపురం, రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 2.08 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు.

