Home Page SliderNational

అతి విశ్వాసం పనికి రాదు..

ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదని అన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒంటరిగా బరిలోకి దిగి చతికిలబడింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రివాల్ స్పందించారు. “ఎన్నికలు సమీపిస్తున్నాయి. వాటిని మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎప్పుడూ అతి విశ్వాసంతో ఉండకూడదనేది ఈ ఎన్నికలు నేర్పిన పాఠం. ప్రతి ఎన్నిక, ప్రతి స్థానం కఠినమైనదే. విజయం కోసం కష్టపడి పనిచేయాలి. అంతర్గత పోరు ఉండకూడదు” అని పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేజీవాల్ వ్యాఖ్యలు చేశారు. ఆయన స్వంత రాష్ట్రం హరియాణాలో ఆప్ ఖాతా తెరవలేదు.