Home Page SliderSportsTelangana

ఉప్పల్‌లో వన్డే మ్యాచ్‌.. 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 18న భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ జరగునుంది. వన్డే మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజారుద్దీన్‌ అన్నారు. ఈ నెల 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయన్నారు. ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండవని తెలిపారు. ఆన్‌లైన్‌లో పేటీఎంలో మాత్రమే టికెట్లను విక్రయిస్తామని తెలిపారు. ఈ నెల 15 నుంచి 18 వరకు ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు ఫిజికల్‌ టికెట్లను తీసుకోవాలన్నారు. జనవరి 14న న్యూజిలాండ్‌ టీం, 16వ తేదీన టీమిండియా హైదరాబాద్‌ రానున్నాయని తెలిపారు. 15వ తేదీన న్యూజిలాండ్‌ టీం ప్రాక్టీస్‌ చేస్తుందని… 17న ఇరు జట్లు ప్రాక్టీస్‌ సెషన్లో పాల్గొంటాయని అజారుద్దీన్‌ వెల్లడించారు.