Home Page SliderNational

మరోసారి నోట్ల రద్దు.. చంద్రబాబు కామెంట్

దేశంలో మరోసారి నోట్ల రద్దుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో కొందరు వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ అవినీతి ప్రయత్నాలను అడ్డుకోవాలంటే రూ.500, రూ.200 నోట్లు రద్దు చేయాలని బ్యాంకర్ల సమావేశంలో సూచించారు. వాటి స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఒక ఆలోచింపచేసే విషయంలా కనబడుతున్నాయి.