ఎన్నికల విధుల్లో వాలంటీర్లు వద్దు- ఎస్ఈసీ
◆జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో ఎస్ఈసీ సమావేశం.
◆వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించిన ఏ పనులూ అప్పగించొద్దని సూచన.
◆ ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నా వారి సేవల వినియోగం వద్దని వివరణ.
ఏపీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనే ఎన్నికల విధుల్లో వినియోగించరాదంటూ ఆయన జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమావేశం సందర్భంగా మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయొద్దని ఆయన సూచించారు. వాలంటీర్లకు ఎన్నికల సంబంధించిన ఏ పనులను అప్పగించవద్దని ఆదేశించారు. ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నందున వారిని భాగస్వాములను చేయొద్దని కూడా మీనా ఆదేశాలు జారీ చేశారు.