Home Page SliderNational

ఉడికించి తింటే నో ప్రాబ్లం

బర్డ్ ఫ్లూ భయం, అధికారుల వరుస హెచ్చరికలతో జనం చికెన్ కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. దీంతో డిమాండ్ లేక తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపో యాయి. ఆదివారం కిలో రూ.210- 230 ఉండగా.. ఇవాళ కిలో రూ.150-170 పలుకు తోంది. ధర తగినా చికెన్ కొనుగోలు చేసేందుకు ప్రజలు
ముందుకు రావడం లేదు. నాన్వెజ్ ప్రియులు ప్రత్యామ్నా యంగా మటన్, చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు.. చికెన్, గుడ్డు తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని, అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకదని పశువైద్యులు చెబుతున్నారు. కోడిమాంసం, గుడ్లను మనం 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తామని, అందులో ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని అంటున్నారు. ఈ వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని, మనుషులపై ఎలాంటి ప్రభావం చూపదని చెబుతున్నారు.