Home Page SliderNational

చైనాతో దాడిలో ఒక్కరూ కూడా చనిపోలేదు

అరుణాచల్ ప్రదేశ్‌ తవాంగ్ వద్ద చైనా బలగాలతో జరిగిన దాడి ఘటనలో ఒక్క భారతీయుడు గాయపడలేదని, చనిపోలేదన్నారు దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా బలగాలతో, ఇండియా దాడి ఘటనకు సంబంధించి ఆయన లోక్ సభకు వివరాలు అందించారు. డిసెంబరు 9న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో సైనికులు ఎవరూ చనిపోలేదని, తీవ్రంగా గాయపడలేదని లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు లోక్‌సభలో మాట్లాడుతూ, సరిహద్దు ఘర్షణ జరిగిన వెంటనే ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా చైనాతో మాట్లాడిందని అన్నారు. సరిహద్దులో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు మా బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఉద్ఘాటించారు. గత వారం తవాంగ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖను మార్చడానికి చైనా దురాక్రమణను భారత్ బలగాలు తిప్పికొట్టాయంది కేంద్రం. ఐతే కేవలం ప్రకటనతో సంతృప్తి చెందలేదని, కీలకమైన సరిహద్దు సమస్యపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు లోక్ సభలో డిమాండ్ చేశాయి. చాలా మంది ప్రతిపక్ష ఎంపీలు నిరసనగా వాకౌట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ ప్రభుత్వ వైఖరి సరైనది కాదని అన్నారు. అంతకుముందు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మరియు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, సమావేశాలను నిలిపివేయాలని మరియు సరిహద్దు ఘర్షణపై చర్చను కోరుతూ వాయిదా వేశారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ అంశంపై చర్చించాలని కోరుతూ రాజ్యసభలో నోటీసు ఇచ్చింది.