Andhra PradeshHome Page Slider

అసెంబ్లీ,కౌన్సిల్ గ్యాలరీల్లో ఇవాళ మీడియాకు అనుమతి నిరాకరణ

• భారత ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు ఉన్నవారికే అనుమతి
• మీడియాకు అసెంబ్లీ ప్రాంగణంలోని నిర్దేశిత ప్రదేశం వరకు పర్మిషన్
• 4వ బ్లాకు పబ్లిసిటీ సెల్ నుండి యధావిధిగా అసెంబ్లీ,కౌన్సిల్ లైవ్ కవరేజ్
• రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి వెల్లడి

ఏపీలో గురువారం ఉదయం 9 గం.ల నుండి సాయంత్రం 4గం.ల వరకు అసెంబ్లీ భవనంలో ఎంఎల్ఎ కోటా ఎంఎల్సీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అసెంబ్లీ, కౌన్సిల్ మీడియా గ్యాలరీల్లోకి మీడియాకు అనుమతి లేదని ఎంఎల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ,శాసన మండలి సంయుక్త కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే అధికారుల గ్యాలరీల్లోకి కూడా అధికారులు ఎవరికీ అనుమతి లేదన్నారు. మీడియా ప్రతినిధులు అందరూ గమనించి గురువారం అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల కవరేజ్ నిమిత్తం అసెంబ్లీ భవనంకు వద్దకు రావద్దని ఆయన స్పష్టం చేశారు. 4వ బ్లాకు పబ్లిసిటీ సెల్ నుండి అసెంబ్లీ,కౌన్సిల్ సమావేశాల లైవ్ కవరేజ్ చేయబడుతుందని, ఎంఎల్సీ ఎన్నికల కవరేజ్ నిమిత్తం మీడియా ప్రతినిధులకు భారత ఎన్నికల సంఘం వారు జారీ చేసిన పాసులు కలిగిన మీడియా ప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణం లోని నిర్దేశిత ప్రదేశం వరకు అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు.