Andhra PradeshHome Page Slider

నిమ్మగడ్డ ప్రసాద్‌కు హైకోర్టులో షాక్

ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాగా ఆయన తన కంపెనీ వాన్‌పిక్‌లో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి.అంతేకాకుండా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే ఆ పిటిషన్‌‌పై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా దానిని కొట్టివేసింది.