Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPolitics

కల్తీ మద్యం స్కామ్‌పై ఘాటుగా విరుచుకుపడ్డ పేర్ని నాని

వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ పాలనలో అమలు చేసిన QR కోడ్ లిక్కర్ పద్ధతిని రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం కల్తీ మద్యం దందాకు మార్గం సుగమం చేసిందని ఆయన ఆరోపించారు.

“ఈ ప్రభుత్వ బార్ పాలసీ వెనుక భారీ స్కామ్ దాగి ఉంది. నకిలీ మద్యం విక్రయాల కోసం రూ.99 లిక్కర్ స్కీమ్‌ను ఆపేశారు. రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా కల్తీ మద్యం తెచ్చి అమ్ముతున్నారు,” అని పేర్ని నాని మండిపడ్డారు.

తాను చెప్పిన విషయాలను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని, ధైర్యం ఉంటే అన్ని పార్టీల నేతలతో కలిసి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
“నేను సాక్ష్యాలు చూపుతాను – వాళ్లకు ధైర్యం ఉంటే కమిటీ వేయండి,” అని సవాలు విసిరారు.