Home Page SliderNational

పీసీసీ పదవికి నానా పటోలే రాజీనామా

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ ఘోరంగా ఓటమి పాలైంది. ఈనేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘మహా’ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఆయన సకోలి స్థానం నుంచి 208 ఓట్ల మార్జిన్ తో గెలుపొందారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 సీట్లు ఉండగా.. మహాయుతి 233 స్థానాల్లో విజయం సాధించింది. అటు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 51 చోట్ల గెలుపొందింది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్ మారిపోయింది. 2021లో నానా పటోలే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గత లోక్ సభ ఎన్నికల్లో.. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పోటీ చేసిన 17 స్థానాలకు గాను 13 స్థానాలను గెలుచుకుంది.