Home Page SliderTelangana

అల్లు అర్జున్ వల్లనే నా భార్య చనిపోయింది..

పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మృతురాలు రేవతి భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కి రావడం వల్లే తన భార్య చనిపోయిందన్నారు. అలాగే తన కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని రేవతి భర్త పేర్కొన్నారు. ఒకవేళ బన్నీ రాకపోయి ఉంటే అంత క్రౌడ్ ఉండేది కాదన్నారు. తన కుమారుడు నెల రోజుల ముందు నుంచి పుష్ప-2 సినిమాకు వెళదామని బలవంతం చేయడంతోనే తాను ఆ రోజు ప్రీమియర్ షోకి తీసుకెళ్లానన్నారు. శ్రీతేజ్ కు అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానం అన్నారు. ఆయన పాటలు, డైలాగులు చెబుతూ ఎల్లప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండేవాడని తెలిపారు. ఆ రోజు థియేటర్ లో ఎంజాయ్ చేద్దాం డాడీ అని పేపర్లు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాడని, ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పటికే హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.