జల్ , జంగల్, జమీన్ కోసం పోరాడిన గొప్ప నాయకుడు
కొమురం భీం వర్ధంతి ని పురస్కరించుకొని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొమరం భీం చౌక్ లోని భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆరోజు ఆదివాసులు, మిగతా ప్రజల జీవితాలతో ఆనాడు ఉన్నటువంటి నిరంకుశ పాలనను ఎదిరించడానికి జల్ , జంగల్, జమీన్ కోసం పోరాడిన గొప్ప నాయకుడు కొమురం భీమ్ అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మారుతున్న పరిస్థితులలో ఆదివాసుల జీవితాలలో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలు ఏవైనా కావచ్చు పాలకులు ఎవరైనా కావచ్చు ఆనాడు కొమరం భీం కన్నా కళలు , ఆశలను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గడచిన పదేళ్లలో ఆదివాసి బతుకులు మారలేదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదన్నారు. వారి బతుకులను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల మంది రూపాయలు ఖర్చు చేసిందన్నారు. అయినప్పటికీ గతంలో ఉన్న ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందని గుర్తు చేశారు. అదే రీతిలో ఈ ప్రభుత్వం సైతం నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు.

