NewsTelangana

నడ్డాను కలిసిన మిథాలీ రాజ్‌

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వరంగల్‌లో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభ కోసం తెలంగాణ టూర్‌కు వచ్చారు. అందులో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్నజేపీ నడ్డాకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తరుణ్‌ చుగ్‌లతోపాటు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతించారు. జేపీ నడ్డా శంషాబాద్‌ నుంచి నేరుగా నోవాటెల్‌ హోటల్‌కి వెళ్లారు. నోవాటెల్‌లో బీజేపీ నేతలతోపాటు మిథాలీరాజ్‌తో నడ్డా భేటీ అయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ వెంకటనారాయణ నివాసానికి నడ్డా చేరుకొని వారితో మాట్లాడనున్నారు. సాయంత్రం హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే  బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. వరంగల్‌ సభ అనంతరం హైదరాబాద్‌కు జేపీ నడ్డా తిరుగుపయనం అవుతారు. రాత్రి 7:30 గంటలకు నోవాటెల్‌లో నటుడు నితిన్‌తో నడ్డా భేటీ కానున్నారు.