Andhra PradeshHome Page Slider

ఆర్టీసీ బస్సును నడిపిన మంత్రి.. షాక్ లో అధికారులు

ఏపీ మంత్రి సవిత స్టీరింగ్ పట్టుకుని ఆర్టీసీ బస్సును నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్టీసీ డిపోకు నూతనంగా రెండు బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ఓ బస్సు ట్రైల్ రన్ చేశారు. మంత్రి సవిత స్టీరింగ్ పట్టుకుని బస్సు నడపడంతో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం పదివేల కోట్లు అప్పు చేసినా మౌలిక వసతుల కల్పనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కొత్త బస్సులను గత ప్రభుత్వంలో కొనుగోలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 400 బస్సులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.