Home Page Sliderhome page sliderPoliticsTelangana

డెక్కన్ సిమెంటు వివాదానికి తనకు సంబంధం లేదని మంత్రి ఉత్తమ్

డెక్కన్ సిమెంటు కంపెనీ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆ వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు.

“ఆ విషయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు. నా ప్రమేయం లేదని కొండా సురేఖ కుమార్తె కూడా వెల్లడించారు కదా,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ముక్తసరిగా స్పందించారు.

ఇటీవలి రోజులుగా మంత్రి కొండా సురేఖ మరియు కొంతమంది ఇతర మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు రేగుతున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది.

వివాదం తీవ్రత పెరగడంతో పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. పరిస్థితిని సమీక్షించి, నాయకులతో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం.