హుజుర్నగర్ వాసుల కల నెరవేర్చిన మంత్రి ఉత్తమ్
హుజుర్నగర్ అభివృద్ధిపై మరోమారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్క్ చూపించారు. ఎంతో కాలం నుండి పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐ.టి.ఐ) కావాలని స్థానికుల నుంచి డిమాండ్కు పరిష్కారం చూపించారు. ఐటీఐ మంజూరుతో పాటు, శాశ్వత భవన నిర్మాణానికిగాను 14.35 కోట్లు నిధులను విడుదల చేయించారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్, డీజిల్ మెకానిక్లతో పాటు వెల్డర్ కోర్సులలో శిక్షణ నిమిత్తం ప్రారంభిస్తు కొత్త ఐ.టి.ఐతో నిరుద్యోగులకు ప్రయోజనకారి కానుంది. 5 కోర్సులలో 216 విద్యార్థులతో ప్రారంభం కానున్న ఐ.టి.ఐకి ప్రిన్సిపాల్తో సహా 8 పోస్టులను మంత్రి ఉత్తమ్ మంజూరు చేయించారు. గతంలో మంజూరు చేయించిన అడ్వాన్డ్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలోనే రామస్వామి గుట్ట వద్ద కొత్తగా మంజూరైన ఐ.టి.ఐని నెలకొల్పనున్నారు.


