మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు
మంథనిలో ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరినదీ నీటి ప్రవాహాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రజలకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఐదు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల దోమల ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ గ్రామంలో విష జ్వరాలు వస్తే ఆ గ్రామాన్ని వెంటనే హెల్త్ క్యాంపు నిర్వహించి వారికి వైద్య సదుపాయం అందించాలని, మంథని నియోజకవర్గంలో ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రతి వ్యక్తికి మెరుగైన వైద్య సదుపాయాన్ని ఇవ్వాలని జిల్లా వైద్య అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆ రైతులకు ధైర్యం చెప్పి స్పష్టంగా పంట నష్టం ఎంత జరిగిందో చూడాలని అధికారులను ఆదేశించారు.

