వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి సమీక్ష
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులతో సచివాలయంలో సన్నాహాక సమావేశం జరిగింది. రాష్ట్రంలోని అన్ని విత్తన కంపెనీలతో మరియు వ్యవసాయ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాబోయే వానాకాలంలో అవసరమైన విత్తనాల లభ్యత, కంపెనీల పనితీరు, విత్తనాల కొరత ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష నిర్వహించారు.