తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
తెలంగాణలో ఐపీఎస్ల బదిలీలు జరుగుతున్నాయి. ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్సనల్ అడిషనల్ డీజీగా సౌమ్యా మిశ్రా, డ్రగ్ కంట్రోల్ డైరక్టర్గా కమల్ హసన్ రెడ్డి, ఏసీబీ డైరక్టర్గా ఏఆర్. శ్రీనివాస్, మేడ్చల్ డీసీపీగా ఉన్న సభారేష్, హోంగార్డ్స్ టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా కిశోర్ ఝూను నియమించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఈ బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

