Home Page SliderNational

ఆరుగురిని పెళ్లి చేసుకుంది.. ఏడో వివాహానికి పట్టుబడింది..

ఓ మహిళ ఆరుగురిని పెళ్లి చేసుకుంది.. ఇంతటితో ఆగకుండా ఏడో పెళ్లికి సిద్ధమయింది. అయితే.. ఏడో పెళ్లి కి రెడీ అవుతున్న తరుణంలో పోలీసులు ఆమెకు షాకిచ్చారు.. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని బందాకు చెందిన విమలేశ్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి, పూనమ్, సంజన గుప్తా ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఒంటరి పురుషులకు గాలం వేసి, పూనమ్ ను ఇచ్చి పెండ్లి జరిపించేవారు. పెండ్లి కుదిర్చినందుకు విమలేశ్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి డబ్బులు కూడా తీసుకునేవారు. పూనమ్ కు తల్లిగా సంజన గుప్తా నటించేది. పెళ్లి అయ్యాక కాపురానికి వెళ్లిన పూనమ్.. సమయం చూసి ఇంట్లోని నగలు, నగదుతో పరారయ్యేది. ఇలా ఆరుగురిని పెండ్లి చేసుకొని మోసం చేసింది. ఏడో పెళ్లి కోసం శంకర్ ఉపాధ్యాయ్ అనే ఒంటరి పురుషుడిని విమలేశ్ సంప్రదించాడు. కమిషన్ మాట్లాడుకుని పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. అయితే, వారి తీరును అనుమానించిన శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ నలుగురినీ పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.