Home Page SliderNational

లాభాల్లో మార్కెట్..

గత కొన్ని రోజులుగా నష్టాలను చవి చూస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ గాడిలో పడ్డాయి. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 239 పాయింట్లు లాభపడి 77,578కి పెరిగింది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 23,518 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా (3.55%), టెక్ మహీంద్రా (2.28%), హెచీఎఫ్సీ బ్యాంక్ (2.21%), సన్ ఫార్మా (1.60%), టాటా మోటార్స్ (1.47%) కంపెనీలు లాభాల బాట పట్టాయి. రిలయన్స్ (-1.53%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.44%), టాటా స్టీల్ (-1.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.21%), మారుతి (-1.13%) ఈ కంపెనీలు నష్టాలను చవి చూశాయి.