దంతెవాడలో మావోయిస్టుల ఘాతుకం, 10 మంది పోలీసులు, డ్రైవర్ మృతి
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో మినీ వ్యాన్ను ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేల్చివేయడంతో పది మంది పోలీసులు, డ్రైవర్ మరణించారు. మావోయిస్టులను ఏరివేసి కార్యక్రమం ముగిసిన తర్వాత, పోలీసులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్గఢ్ పోలీసు ప్రత్యేక దళం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG)కి చెందిన పోలీసులు, మావోయిస్టులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన స్థానిక గిరిజనులు ఉన్నారు. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రమైన బస్తర్లో తిరుగుబాటుదారులపై అనేక విజయవంతమైన ఆపరేషన్లలో DRG కీలకపాత్ర పోషించింది. దాడి అనంతరం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దంతెవాడలోని అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు క్యాడర్ ఉన్నారన్న సమాచారంతో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కోసం వచ్చిన డీఆర్జీ దళం లక్ష్యంగా ఐఈడీ పేలుడు ఘటన చోటుచేసుకొంది. ఈ ఘటనలో 10 మంది డీఆర్జీ జవాన్లు, డ్రైవర్ వీరమరణం పొందారనే వార్త చాలా బాధ కలిగిస్తోందన్నారు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్.



 
							 
							