Andhra PradeshHome Page Slider

యువ గళం పాదయాత్ర నిర్వహణపై లోకేష్ సమావేశం (ప్రెస్ రిలీజ్)

నారా లోకేష్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి…

మూడున్నర ఏళ్లుగా ఒక సైకోపై పోరాడుతున్నాం.
తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు.
కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు… గతంలో ఎప్పుడూ ఇంత సైకో పాలన చూడలేదు.
ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కార్యకర్తలు, నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధించారు.
అయినా మీరు ఎక్కడా తగ్గలేదు పోరాడారు. టిడిపికి బలం కార్యకర్తలు, నాయకులే.
మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డిలా చేసుంటే వైసీపీ ఉండేది కాదు. ఆ పార్టీ నాయకులంతా ఇతర దేశాలకు పారిపోయేవారు.
కానీ మన వాళ్ళు అలా కాదు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఎం పీకుతావో పీకు అని తొడకొట్టారు.
పసుపు జెండా కోసం ప్రాణం ఇచ్చే బ్యాచ్ మనది.
ప్రజలంతా ఎన్నో ఆశలతో జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు.
కానీ ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.
151 సీట్లు ప్రజలు ఇచ్చినందుకు ఎన్నో గొప్ప పనులు చెయ్యొచ్చు.
కానీ జగన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు కోసమే అధికారాన్ని వాడుకుంటున్నారు.
ఏ వర్గం సంతోషంగా లేరు. జగన్ రెడ్డి పై ప్రజల్లో ద్వేషం కనిపిస్తుంది.
మహిళలు, రైతులు, యువత, ఉద్యోగస్తులు ఆఖరికి పోలీసులు కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.
జగన్ రెడ్డి దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోయింది.
లిక్కర్, సాండ్, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని, ప్రజల్ని దోచుకుంటున్నారు.


ప్రజలపై భారాన్ని విపరీతంగా పెంచారు. కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు.
విచిత్రం ఏంటంటే పేద వాడికి అన్నం పెట్టే అన్న క్యాంటిన్ ఎత్తేసాడు. మనం పేదలకు భోజనం పెడతాం అంటే పెట్టనివ్వడు.
వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో జగన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది.
అందుకే ఈ మధ్య మంత్రులు. ఎమ్మెల్యేలు, నాయకులు జగన్ రెడ్డి చెత్త పరిపాలన గురించి విమర్శిస్తున్నారు.
వార్ ఒన్ సైడ్ అయిపొయింది. ప్రజలంతా మన వైపు ఉన్నారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రాబోతుంది.
దీని కోసం మనం అంతా ఇంకా ప్రజలకు మరింత దగ్గర అవ్వాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే మనం బాదుడే బాదుడు… ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాం.
మీ అందరికి ఆశీస్సులతో త్వరలో నేను యువగళం పాదయాత్ర చేపట్టబోతున్నాను.
యువతను జగన్ మోసం చేసాడు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసాడు.
విదేశీ విద్య పథకం రద్దు చేసాడు. ఉన్న కంపెనీలను తరిమేసాడు. కొత్త కంపెనీలు రావడం లేదు.
ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు యాత్ర చేస్తున్నాను.
అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుంటాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా పోరాడతాను.
ప్రభుత్వం స్పందించకుంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వేంటనే సమస్యలు పరిష్కరిస్తాం.
400 రోజులు, 4 వేల కిలోమీటర్ల మేర నా పాదయాత్ర సాగుతుంది.
మీ సూచనలు, మీ మద్దతు నాకు కావాలి.

పోలిట్ బ్యూరో, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు,
అనుబంధ సంఘాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నారా లోకేష్.

ప్రజా సమస్యల పై పోరాడటానికి జాతీయ ప్రధాన కార్యదర్శి యువ గళం పాదయాత్ర ప్రారంభిస్తున్నారన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజెరపు అచ్చెన్నాయుడు. పార్టీ యంత్రాంగం మొత్తం యువ గళం యాత్ర విజయవంతం అయ్యేలా కృషి చెయ్యాలన్నారు. మూర్ఖుడి పాలనలో ప్రజలు నలిగిపోతున్నారని… రాష్ట్రం మళ్ళీ అభివృద్ది పథంలో నడవాలి అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.