Breaking NewsHome Page SliderPoliticsTelangana

స్థానిక సంస్థల ఎన్నికలు మరింత జాప్యం

తెలంగాణలో ఈనెల 15వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని తొలుత అంతా భావించారు. కానీ, స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోసారి కులగణన సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వేలో పాల్గొనని వారికి ఈనెల 16 నుంచి 28 వరకు కల్పించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశమున్న‌ట్లు తెలుస్తుంది.డిసిఎం భ‌ట్టి విక్ర‌మార్క సైతం కొంత మంది ఉద్దేశ్య‌పూర్వ‌కంగా వివ‌రాలు ఇవ్వ‌లేద‌ని అందుకే ముసాయిదా జాబితా ఆల‌స్యం అవుతుంద‌ని తెలిపారు.దీంతో స్థానిక ఎన్నిక‌లు జాప్యం కాక త‌ప్పేట్లు లేదు.