గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. ఈ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ప్రిలిమ్స్ లోని 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

