Breaking NewsHome Page SliderNational

క‌న‌క‌వృష్టిని కురిపిస్తున్న‌ కుంభ‌మేళా

కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్​రాజ్​కు దాదాపు నెల రోజులుగా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో రోడ్లపై రద్దీ భారీగా పెరిగిపోయింది. రైల్వే స్టేషన్, విమానాశ్రయం​ నుంచి త్రివేణి సంగమ ప్రాంతానికి వెళ్లడానికే గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్​ వల్ల సాధారణ ట్యాక్సీ, రిక్షా సేవలు స్తంభించిపోతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితినే క్యాష్ చేసుకుంటున్నారు స్థానిక యువత. భక్తులకు ట్రాఫిక్​ తిప్పలు తప్పేలా స్థానిక కాలేజీ విద్యార్థులు స్కూటర్లు, బైక్​లతో ట్యాక్సీ సేవలు అందిస్తున్నారు. యువకులతో పాటు అమ్మాయిలు కూడా వివిధ రకాల మోటార్​ సైకిళ్లతో విద్యార్థులు భక్తులను సంగమ ప్రాంతానికి చేరవేస్తూ తాత్కాలిక ఉపాధి పొందుతున్నారు. ఒక రైడ్​కు రూ.100 నుంచి రూ.1000 వరకు ఛార్జ్​ చేస్తున్నారు.చాలా మంది కాలేజీ విద్యార్థులు బైక్ ట్యాక్సీ నడుపుతున్నారు. రోజుకు రూ.3000 నుంచి రూ.5000 వరకు సంపాదిస్తున్నారు. అయితే విద్యార్థులే కాకుండా కొంతమంది ఉగ్యోగులు కూడా ఈ తాత్కాలిక ఉపాధిని పొందుతున్నారు. ఇలా కొందరు బైక్ ట్యాక్సీ సేవలను అభినందిస్తుంటే మరికొందరు అధిక ఛార్జీలను విమర్శిస్తున్నారు. ట్యాక్సీకి బదులు తమ లగేజీతో మోస్తూ నడకమార్గం ఎంచుకుంటున్నారు.