రాఖీవేళ కేటీఆర్ భావోద్వేగం
రాఖీ పండుగ సందర్భంగా తన సోదరి కవితను తలచుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కవిత ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను ఉద్దేశించి ఒక సందేశాన్ని ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. నేడు నువ్వు నాకు రాఖీ కట్టలేని పరిస్థితిలో ఉండవచ్చు. కానీ ఎలాంటి కష్టంలో అయినా నీవెంట తోడుగా ఉంటా ట్వీట్ చేశారు.