‘కిష్కిందకాండం’ 12 రోజుల్లో రూ.50 కోట్లు!
12న రిలీజైన ‘కిష్కిందకాండం’, మూడు ముఖ్య పాత్రలతో నడిచే కథ, 12 రోజుల్లో 50 కోట్ల రూపాయలను రాబట్టిన సినిమా, ఇంకా థియేటర్ల దగ్గర రష్ కొనసాగుతోంది, అసిఫ్ అలీ కెరియర్లో పెద్ద హిట్ మూవీ. మలయాళం ఇండస్ట్రీ నుంచి వరుసబెట్టి భారీ హిట్లు .. బ్లాక్ బస్టర్లు క్యూలో ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్లో నిర్మితమైన సినిమాలు, వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉండటం విశేషం. అలా రీసెంటుగా థియేటర్లలోకి వచ్చిన సినిమాల జాబితాలో ‘కిష్కిందకాండం’ కూడా చేరింది. దింజిత్ అయ్యథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన విడుదలైంది. అసిఫ్ అలీ .. అపర్ణ బాలమురళి .. విజయ్ రాఘవన్ ముఖ్య పాత్రలను పోషించారు. గుడ్విల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై జోబీ జార్జ్ నిర్మించిన సినిమా ఇది. కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారని అంటున్నారు. అలాంటి ఈ సినిమా, 12 రోజుల్లో 50 కోట్ల రూపాయలను రాబట్టడం విశేషం. ఈ సినిమా విడుదలై రెండు వారాలైనా, థియేటర్ల దగ్గర మాత్రం రష్ తగ్గడం లేదని సమాచారం ఉంది.
ఈ ఏడాదిలో చాలావేగంగా భారీ వసూళ్లను రాబట్టిన టాప్ 10 సినిమాలలో ఒకటిగా ఉంది. అసిఫ్ అలీకి మలయాళంలో మంచి ఫేన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఓటీటీ పుణ్యమా అని తమిళ .. తెలుగు భాషల్లోను ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. ఆయన కెరియర్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఫస్టు మూవీ ఇదేనని అంటున్నారు. తండ్రీ, కొడుకు, కోడలు.. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే ఈ కథ, ‘దృశ్యం’ సినిమా మాదిరిగా ఉందనేది పబ్లిక్ టాక్.