కేసీఆర్ శాసనసభా సభ్యత్వం రద్దు చేయాల్సిందే..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. శాసనసభ సమావేశాలకు హాజరు కానందున కేసీఆర్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో సిద్ధిపేట నుంచి పాదయాత్ర చేసి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ను కాంగ్రెస్ శ్రేణులు కలిశారు. గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు వినతిపత్రం అందించనున్నారని తెలుస్తోంది.