కొత్త సంవత్సరంలో ప్రజల్లోకి కేసీఆర్
భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నిన్న ఎక్స్ వేదికగా ఆయన ‘ఆస్క్ కేటీ ఆర్’ పేరుతో నెటిజన్లతో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు తెలంగాణ పదం, కేసీఆర్ పేరు నిలిచే ఉంటుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన పార్టీని, తమ నాయకులందరికీ ఎప్పటికప్పుడు ఆయా అంశాల పైన మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వానికి ఇచ్చిన 420 హమీలు అమలు చేసేందుకు సరిపడా సమయం ఇచ్చారన్నారు. నూతన సంవత్సరం తర్వాత ఆయన నుంచి మరిన్ని కార్యక్రమాలను చూస్తామన్నారు కేటీఆర్.