కేసీఆర్ ఎక్స్ పైర్ అయిన మెడిసిన్
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ 24 గంటల రైతు సాధన దీక్ష చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెప్పిన రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్ వంటి అంశాలను పరిష్కరించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. దీక్షలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపు రి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్లు అక్కర్లేదు. గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎకరాకు కోటి రూపాయలు సంపాదించారట. ఇది అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ కు రైతులను పంపించాలని రేవంత్ సలహా ఇస్తున్న. కేసీఆర్ ఉద్యమం నడిపినన్ని రోజులు ఆయన పులిలా ఉన్నారు. ఆయన స్పీచ్ మిస్ అవుతున్నాం. పిల్లల మాటలు విని పిల్లి అయ్యారు. కేసీఆర్ ఎక్స్ పైర్ అయిన మెడిసిన్. జాతిపిత కావాల్సిన కేసీఆర్.. పిల్లల అవినీతికి పితగా మారారు. బీఆర్ఎస్ చేసిన వినాశనం అంతా ఇంతా కాదు.. మంచి ప్రతిపక్షంగా బీజేపీని చేస్తం” అని అర్వింద్ పేర్కొన్నారు. రైతు సాధన దీక్షలో పార్టీకి చెందిన ఎంపీలు ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, కొండా విశ్వే శ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలపాటు కీలక నేతలు పాల్గొన్నారు.

