Home Page Slider

బీసీ కులగణనపై కవిత హాట్ కామెంట్..

బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కులగణనతో కోటి 15 లక్షల ఇళ్లు, జనాభా 3.70 కోట్లు అని తేల్చిందని అయితే దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52 శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2శాతం ఉన్నట్లు తేల్చారని ఆరోపించారు. ఇది కరెక్టా అని సీఎం రేవంత్ రెడ్డి గుండె మీద చేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు. కరెక్టే అయితే.. సర్వేలో తానిచ్చిన వివరాలు, తన పేరు ఆధార్ కార్డు కొడితే రావాలని చెప్పారు. సర్వే రిపోర్ట్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని కవిత డిమాండ్ చేశారు. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిస్ అయిన వారి కోసం మళ్లీ అవకాశం ఇవ్వాలన్నారు.