‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటించిన కంగనాకి భారీ ఊరట..
భారత దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తీసుకుని సినిమాగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం కోర్టులో సెన్సార్ బోర్డు చిక్కుల్ని ఎదుర్కొంటోందన్న విషయం పాతదే. ఇందులో మెయిన్ రోల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. ఈ సినిమాలో తమను తక్కువ చేసి చూపించారంటూ విడుదలను అడ్డుకోవాలని మధ్యప్రదేశ్లోని ఒక వర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనలను పరిగణనలోకి తీసుకుని మూవీలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ కట్ చేస్తే.. సర్టిఫికెట్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని సెన్సార్ బోర్డు నిర్మాణ సంస్థకు చెప్పింది. దీంతో ఈ విషయంపై నిర్మాణ సంస్థ కొంత టైమ్ తీసుకుంటామని కోరగా.. టైము కూడా ఇచ్చింది. అయితే సోమవారం బాంబే హైకోర్టు దీనిపై మరోసారి విచారణను చేపట్టింది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు తాము అంగీకరించామని నిర్మాణ సంస్థ బాంబే హైకోర్టుకు తెలిపింది. అలాగే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సూచించిన మార్పుల అమలు కోసం ఒక ఫార్మాట్ను కోర్టుకు సమర్పించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే సెన్సార్ బోర్డ్ సూచించిన మార్పులకు నిర్మాణ సంస్థ ఒప్పుకోవడంతో ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బెంచ్ తదుపరి విచారణను తిరిగి అక్టోబర్ 3కు వాయిదా…