ఏపీ గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం
ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్తో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు.

జస్టిస్ అబ్దుల్ నజీర్ కర్ణాటక తీర ప్రాంతానికి చెందినవారు. అతను ఫకీర్ సాహెబ్ కుమారుడు. బెలువాయి/మూడ్బిద్రిలో పెరిగారు. మూడ్బిద్రిలోని మహావీర కళాశాలలో B.Com డిగ్రీ పూర్తి చేశారు. మంగళూరులోని కొడియాల్బైల్లోని SDM న్యాయ కళాశాల నుండి న్యాయ పట్టా పొందారు. 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకుని కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. మే 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 2017లో, నజీర్ సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులయ్యారు. ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే పదోన్నతి పొందిన మూడో న్యాయమూర్తి నజీర్. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బెంచ్లో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక ముస్లిం న్యాయమూర్తి. ముస్లిం షరియా చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ అనుమతించబడుతుందనే వాస్తవం ఆధారంగా నజీర్, మరొక న్యాయమూర్తి ట్రిపుల్ తలాక్ ప్రామాణికతను సమర్థించారు. ఐతే బెంచ్ దీనిని 3:2 మెజారిటీతో అడ్డుకుంది.

అయోధ్య వివాదంపై చారిత్రక 2019 సుప్రీంకోర్టు తీర్పు యొక్క 5 న్యాయమూర్తుల బెంచ్లో జస్టిస్ నజీర్ కూడా సభ్యులు. వివాదాస్పద ప్రాంతంలో హిందూ నిర్మాణం ఉనికి గురించి పేర్కొన్న ASI నివేదికను సమర్థించింది. రామమందిరానికి అనుకూలంగా తీర్పును ఇచ్చారు. చివరికి 5-0 తీర్పుతో సుదీర్ఘ వివాదానికి ముగింపు పలికిన్ బెంచ్లో కీలకంగా వ్యవహరించారు. పదవీ విరమణకు కొన్ని నెలల ముందు, జస్టిస్ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2016 నోట్ల రద్దుకు సంబంధించిన కేసులను విచారించింది. జనవరి 4, 2023న నజీర్ పదవీ విరమణ చేశారు.

