Home Page SliderNational

ఎన్సీపీలో చేరిన జిశాన్ సిద్ధిఖీ

మహారాష్ట్ర ఎన్సీపీ పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జిశాన్ సిద్ధిఖీ కూడా ఎన్సీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో టికెట్ దక్కకపోవడంతో అతడు అజిత్ పవార్ వర్గంలో చేరారు. ఎన్సీపీ తరపున బాంద్రా ఈస్ట్ నుంచి జిశాన్ ను బరిలో దింపుతున్నట్లుగా పార్టీ వెల్లడించింది. గతంలో జిశాన్ కాంగ్రెస్ టికెట్ పై వంద్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అతడికి టికెట్ దక్కలేదు. ఎన్సీపీ పవార్ వర్గం నేత, జిశాన్ తండ్రి బాబా సిద్ధిఖీ కొద్దిరోజుల క్రితమే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురయ్యారు. ఈనేపథ్యంలో ఆయన ఎన్సీపీలో చేరడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.