Home Page SliderNational

OTTలో స్ట్రీమింగ్‌కి వచ్చేసిన జాన్వీకపూర్ స్పోర్ట్స్‌ డ్రామా

రీసెంట్‌గా రిలీజైన బాలీవుడ్ సినిమా వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లో టాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావ్ అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌లు నటించిన ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా “మిస్టర్ అండ్ మిస్ మాహి” కూడా ఒకటి. దర్శకుడు శరన్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ మార్కెట్‌లో యావరేజ్ టాక్ తెచుకున్నప్పటికీ వసూళ్ల పరంగా బాగానే రన్ అయింది.

 ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్‌గా ఓటిటిలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. డీసెంట్ ఫ్యామిలి ఎమోషన్స్‌తో సాగే ఈ స్పోర్ట్ డ్రామాలో రాజ్ కుమార్ రావ్, జాన్వీ కపూర్‌లు సాలిడ్ పెర్ఫామెన్స్‌లు అందించారు. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు అయితే నేటి నుంచి దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రం చూడాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్‌లో చూడొచ్చు.