Andhra PradeshHome Page Slider

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన వార్నింగ్

సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ వార్నింగ్ ఇచ్చింది. జనసేన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. జనసేన పార్టీతో జానీ మాస్టర్‌కు ఎలాంటి సంబంధం ఉండకూడదని, తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశారని ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. వైసీపీ నేతలు జానీ మాస్టర్ జనసేనకు చెందినవాడని పేర్కొంటూ ఇప్పటికే ఈ విషయంపై జనసేనపై విమర్శలు చేస్తున్నారు. దీనితో ఎలాంటి అపోహలకు, అనుమానాలకు తావు లేకుండా జనసేన పార్టీ ఈ ప్రకటన చేసింది.