వెనక్కి తగ్గేదేలే…!
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సీబీఐ, ఈడీ దాడులు చేస్తూ.. తమ సమయాన్ని వృథా చేస్తుందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముషీరాబాద్లో జరిగిన తెలంగాణ జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో ఉన్నటువంటి సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందన్నారు. ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. రెస్ట్ కూడా తీసుకునేది లేదన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు రావని..నిప్పులొస్తాయన్నారు. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, రైతులు, కళాకారులను, కవులను ఏకం చేసుకుని ముందుకెళ్తామన్నారు.

