Home Page SliderTelangana

ఏపీకి ఐటీ సంస్థలు క్యూ కట్టాలి-కేటీఆర్..

హనుమకొండ: దేశంలో భవిష్యత్ అంతా ద్వితీయ శ్రేణి నగరాలదే అని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా వరంగల్, ఖమ్మం, నల్గొండ వంటి నగరాలు, పట్టణాలకు పరిశ్రమలు తీసుకువస్తోందని చెప్పారు. వరంగల్, హనుమకొండలో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్. 900 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. మడికొండ ఐటీ పార్క్‌ను 40 కోట్లతో సాఫ్ట్‌వేర్ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.

రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌కు, వరంగల్‌కు ఏమంత పెద్ద తేడా ఉండదు. ఐటీ రంగంలో భవిష్యత్ అంతా టైర్ 2 నగరాలదే. వరంగల్‌లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలి. అక్కడా ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నాను. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానన్నారు కేటీఆర్. బెంగళూరు ఐటీ సంస్థల్లో 40 శాతం మంది తెలుగువాళ్లే. అక్కడి నుండి వచ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఉన్నచోటే యువతకు ఉద్యోగాలు కావాలి. కులం, మతం పేరుతో కొట్టుకుకోకుండా ఉండాలి అని కేటీఆర్ అన్నారు.