శ్రీరామ నవమితో ఐపిఎల్ వేదిక మార్పు
ఐపీఎల్ 2025 కు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. మార్చి 22న ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. ఆన్ని ఫ్రాంచైజీలు టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 06న కోల్కతా నైట్రైడర్స్ – లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్లో మార్పులు జరిగాయి. తొలుత ఈ మ్యాచ్కు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రకటించారు. కానీ, తాజాగా భద్రతా కారణాల వల్ల వేదికను మార్చినట్లు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు వెల్లడించారు.ఏప్రిల్ 06 ఆదివారం రోజున శ్రీ రామ నవమి కావడంతో ఈ మార్పు చేశారు. పండగ సందర్భంగా ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఊరేగింపులు జరిగే అవకాశం ఉందని మార్చామని చెప్పారు. అయితే మ్యాచ్కు భద్రత కోసం పలు దఫాలుగా కోల్కతా పోలీసులతో చర్చించామని,కానీ వారు భద్రత కల్పించడం కష్టమని చెప్పారన్నారు. ఒకవేళ పోలీసుల సెక్యూరిటీ లేకపోతే ఏప్రిల్ 6న మ్యాచ్ కోసం వచ్చే 65 వేల మందికి పైగా వచ్చే ప్రేక్షకులను కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుందన్నారు. అందుకే మ్యాచ్ను రీ షెడ్యూల్ చేయమని బీసీసీఐను అడగగా, అదే రోజు మ్యాచ్ వేదికను గువాహటికి మార్చిందని వెల్లడించారు.