Andhra PradeshHome Page Slider

మదనపల్లి ఫైల్స్ దగ్దం కేసుపై కొనసాగుతున్న విచారణ

ఏపీలోని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో ఫైల్స్ దగ్దం అవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఈ విచారణ ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.విచారణలో భాగంగా ఈ కేసులో  అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత పెద్దిరెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉన్నవాళ్లు,పీఏలుగా పనిచేసిన వారి ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి.మరోవైపు భూబాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.