Home Page SliderTelangana

ఇంకెప్పుడూ ఇండిగో ఎక్కేది లేదు.. నటి మండిపాటు

ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. తాజాగా ఆ సంస్థకు చెందిన ఫ్లైట్ లో ప్రయాణించినప్పుడు సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారంటూ తనకు ఎదురైన ఇబ్బందులను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. గోవాలో తాను ఎక్కిన ఇండిగో 6e585 విమాన సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. “నా లగేజీ బ్యాగ్ ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పిన విధంగా చేయని పక్షంలో గోవాలోనే నా సామగ్రిని వదిలేస్తామని బెదిరించారు. నాతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బ్యాగ్ ను సెక్యూరిటీ ట్యాగ్ కూడా పెట్టలేదు. ఇదొక రకమైన వేధింపు. ఇంకెప్పుడూ ఇండిగో ఎక్కేది లేదు” అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.