Home Page SliderNational

పుణె టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమి

సొంతగడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 245 పరుగులకే ఆలౌటైంది. పుణేలో మూడ్రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టు మ్యాచ్ లో కివీస్ 113 పరుగుల భారీ తేడాతో నెగ్గి… మూడు టెస్టుల సిరీస్ ను 2-0తో చేజిక్కించుకుంది. తద్వారా భారత గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. కివీస్ స్పిన్నర్ శాంట్నర్ మొత్తం 13 వికెట్లతో సత్తా చాటారు. ఇక, భారత్ తన సొంతగడ్డపై ఓ టెస్టు సిరీస్ ను కోల్పోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.